Thursday, September 23, 2010

"శుక్లాంబరధరం విష్ణుం......"

వినాయక రంజాన్

"మెహా గేణపదిం మెనసా జ్మరామి......."

వినాయక చవితిపూటా, ప్రొద్దున్నే ఓ బ్లాగు తెరవగానే, శ్రావ్యం గా వినిపిస్తూంది--మహమ్మదీయురాలు షబానా అజ్మీ ఓ సినిమాకోసం ఖష్టపడి నేర్చుకొని, పాడిన పాట!

కాళిదాసు కవిత్వం కొంత, నా పైత్యం కొంత అన్నట్టు, అందులో 3 పాళ్లు అరవ సాంబారు వాసన, ఓ పాలు సంస్కృతం, అప్పుడప్పుడూ కాస్త తెలుగు స్వరం!

ఇక హారం లోకి వెళ్లి అదేదో ప్రదేశ్ మీడియా కబుర్లు లోకి జొరబడితే, ఆహా! కన్నులపండువ--ఓ రేఖా చిత్రం--వినాయకుడు తన తొండాన్ని 'అర్థ చంద్రాకారం ' లో నిలబెట్టాడు. ఆ ఆకారం మధ్యలో ఓ నక్షత్రాన్ని చిత్రించాడు వాడెవడో కార్టూనిస్టుట! (ఇది ఖచ్చితం గా కార్టూన్ కాదు కదా?)

పైన వ్యాఖ్య, "అందరికీ వినాయక చవితి/రంజాను శుభాకాంక్షలు" అంటూ!

యెంతబాగుందండీ!

వినాయకుడి పొట్టపగిలేలా చేసినవాడు చంద్రుడు! తనకి ఆగర్భ శతృవు! వాడి ఆకారం లో తన తొండాన్ని వుంచడమా!

దానిమీదో నక్షత్రమా! అక్కడనించి, రంజాను శుభాకాంక్షలా! యెక్కడికి పోతున్నాం మనం?

ఇంగ్లీషులో ఓ సామెత వుంది--"మోర్ లాయల్ దేన్ ది కింగ్" అని! రాజు కన్నా, రాజుగారికి యెక్కువ విశ్వాసపాత్రుడు అని అర్థం చేసుకోవచ్చు మనం.

అలా--మహమ్మదీయులకే లేని "దూల" మీకెందుకంటా?

హారం లో యే వొక్కటైనా మహమ్మదీయుడి బ్లాగు వుందా? యెవడైనా తెలుగులో రాస్తున్నాడా? ఇంకే కూడలి, చెత్తా, చెదారం లో అయినా, మహమ్మదీయుడెవడైనా హిందువులకి వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పాడా?

షియా అనుకుంటా, ఎన్ రహంతుల్లా మాత్రం అప్పుడప్పుడూ మన బ్లాగుల్లో తన చక్కటి కామెంట్లు పెడుతూంటాడు. ఆయనా--అసలైన మహమ్మదీయుడంటే!

ఇకనైనా మన మహా విశ్వవ్యాప్త, సర్వమత సమానత్వ, లౌకిక, ఇంకేదో పిచ్చితనాన్ని విడనాడుదామా? కొనసాగిద్దామా?

ఇక్కడనించీ, నేను ప్రతీ టపాలోనూ, వివిధ దేశాల్లో "ఇస్లామిక్ టెర్రరిజం" కి బలయినవాళ్ల వార్తల్నీ, "మావిస్ట్" తీవ్రవాదానికి బలయినవాళ్ల వార్తల్నీ, విమానాలకీ, ఛాపర్లకీ "తృటిలో తప్పిన" ప్రమాదాలనీ  వ్రాస్తాను.

చదవండి--కొనసాగించండి!

కాశ్మీరులో 18-09-2010 న కాల్పుల్లో ముగ్గురు మృతి. 30 మందికి గాయాలు.

బగ్దాదులో 19-09-2010 న పేలిన కారు బాంబు. 31 మంది మృతీ, 70 మందికి పైగా తీవ్ర గాయాలూ.

----------------------------------------------------------

19-09-2010 న ఒరిస్సాలో కోరాపుట్ జిల్లలో 20 మంది సాయుధ మావిస్టుల దాడి, ఓ తండ్రీ కొడుకుల హతం

----------------------------------------------------------

19-09-2010 న హర్యానా సీ ఎం హెలికాప్తర్ కి తృటిలో తప్పిన ప్రమాదం. బురదలో కూరుకుపోయిన చక్రం.

అదేరోజు, సాంకేతిక లోపం కారణం గా, "కింగ్ ఫిషర్" విమానం బెంగళూరు నించి గన్నవరానికి 35 నిమిషాలు అలస్యం గా వచ్చి, మళ్లీ గంటన్నర తరవాత బెంగళూరు కి బయల్దేరిందట. ఇందులో వై ఎస్ ఆర్ భార్య విజయ లక్ష్మి, పులివెందుల ఎం ఎల్ ఏ మరో విజయలక్ష్మి, వై ఎస్ జగన్ భార్య భారతి వెళ్లారట.

Wednesday, September 22, 2010

లౌకికత్వము

పరమత సహనము

మన ఇండియా, దటీజ్ భారత్ లో ప్రతీవాడు తనను మించిన సెక్యులరిస్ట్ వేరెవడూ లేడని చెప్పుకుంటాడు.

మన రాజ్యాంగం ఉద్దేశించినది "మత ప్రసక్తి లేని లౌకిక" రాజ్యాన్ని.

ఇందిరాగాంధీ పుణ్యమా అని, దాన్ని "సర్వమత సమభావ లౌకిక" అని మార్చేశారు.

అక్కడినించే మొదలయ్యాయి అనేక నాటకాలు. అందరూ అందులో పాత్రధారులే.

టపా కోసం ఎదురుచూస్తు ఉండండి.